Tuesday 26 February 2013

తెలంగాణ చరిత్రపై వెలుగు రేఖలు

తెలంగాణ చరిత్రపై వెలుగు రేఖలు

నేటి కాలంలో పరిశోధన అనేది ‘థాంక్ లెస్’ జాబ్. అయినా తెలంగాణ అస్తిత్వ ఉద్యమ స్పృహతో ఈ పనిని సమర్థవంతంగా చేస్తున్న విమర్శక, పరిశోధకుడు సుంకిడ్డి నారాయణడ్డి. తెలంగాణ ప్రాచీన సాహిత్యాన్ని ‘ముంగిలి’ పేరిట చరివూతకెక్కించిన సుంకిడ్డి ఇటీవలి రచన ‘తెలంగాణ చరిత్ర. విశ్వవిద్యాలయా లు, ప్రభుత్వ అకాడమీలు, పరిశోధక బృందాలు కలిసి, విడివిడి గా చేయాల్సిన పనిని ఈయన ఒంటిచేత్తో చేశాడు. గతంలో హైదరాబాద్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ‘ఫ్రీడం స్ట్రగుల్ ఇన్ హైదరాబాద్’ పేరిట నాలుగు భాగాల్లో స్వాతంవూత్యోద్యమ చరివూతను రికార్డు చేసింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు తెలంగాణ చరివూతను ప్రత్యేకంగా రాసిన వారు లేరు. ఆంధ్రవూపదేశ్ చరివూతలో భాగంగా అనుబంధాలకు, ఉప శీర్షికలకు, పుట్‌నోట్స్‌కు మాత్ర మే పరిమితమైన చరివూతను ఒక్క దగ్గరకు తీసుకొచ్చి భవిష్యత్ పరిశోధకులకు దిశానిర్ధేశం చేసిన మార్గదర్శి సుంకిడ్డి నారాయణడ్డి. ఆయన వేసిన దారి భావి పరిశోధనలకు రహదారి. ఆంధ్ర మహాసభల తొలి అధ్యక్షుడిగా ఆ ఉద్యమం ఊపందుకోవడానికి అచ్చంగా సురవరం ప్రతాప్‌డ్డి కూడా ఇదేపని చేసిండు.సురవరం ప్రతాప్‌డ్డి మొదట ‘గోలకొండ కవుల’ సంచిక, తర్వాత ఆంధ్రుల సాంఘిక చరిత్ర గ్రంథాల్ని వెలువరించాడు. సుంకిడ్డి కూడా ‘ముంగిలి’ పేరిట గోలకొండ సంచికలో కూడా లేని వందలమంది కవుల్ని మన ముందట పెట్టిండు. అలాగే ఆంధ్రుల సాం ఘిక చరివూతలో కూడా చోటు చేసుకోలేకపోయి న వాకాటాకుల గురించి ‘తెలంగాణ చరిత్ర’ లో రికార్డు చేసిండు. నిజానికి సురవరం ప్రతాప్‌డ్డికి పత్రికా సంపాదకత్వం వల్లనైతేనేమి, ప్రతిభ వల్లనైతేమి చాలా పుస్తకాలు, తాళపత్ర గ్రంథాలు అడిగిందే తడవుగా ఆయనకు అందుబాటులో వచ్చేవి. అలాంటి సదుపాయాలు, వనరులు లేకపోయినప్పటికీ సుంకిడ్డి తన పరిశోధన ప్రతిభతో అద్భుతమైన గ్రంథాన్ని తెలుగు పాఠకులకు అందచేసిండు. అందుకే ఆధునిక సురవరం- సుంకిడ్డి.

తెలంగాణలోని విశ్వవిద్యాలయాల్లో సైతం ఇక్కడి చారివూతకాంశాలపై సరైన పరిశోధన జరగకపోవడానికి ప్రధాన కారణం సమాచార అలభ్యత. సమాచారమే అరకొరగా ఉన్నప్పుడు దానిపైన విశ్లేషణ, విమర్శ కూడా ఆ నిష్పత్తిలోనే ఉంటుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లో తెలంగాణ చరివూతను సాధికారికంగా, సమక్షిగం గా రికార్డు చేసిండు. సుంకిడ్డి లెఫ్ట్, రైట్ భావజాలంతో సంబం ధం లేకుండా ప్రతి ఒక్కరూ విస్మరించిన ‘అసఫ్‌జాహీల’ కు ఒక చాప్టర్ కేటాయించి ఆనాటి పరిణామాలను ఇందులో విశ్లేషించాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఊపుమీదున్న ప్రస్తుత సందర్భంలో కొన్ని విషయాలు చెప్పడం, విస్మరించడం కత్తిమీద సాము లాంటిది. ఏకావూమనాథ చరివూతలో ‘మొల్ల’ తెలంగాణ కవయివూతిగా రికార్డయ్యింది. అయితే ఈ పుస్తకం కాకతీయుల అనంతరం రెండువందల సంవత్సరాల తర్వాత రాసిండ్రు. కాబట్టి ఇందులోని విషయాలకు ఆధారాలు లేవని నిరాకరిస్తూ, ఆమెను తెలంగాణ మహిళగా పేర్కొనలేదు. అలాగే నాయకురాలు నాగమ్మది కరీంనగర్ జిల్లా అని ఇటీవల కాలంలోని పరిశోధనలు చెబుతున్నాయి. దీనికి కూడా విశ్వసనీయమైన ఆధారాలు లేవు అన్న కారణంగా ఆమెను కూడా తెలంగాణ మహిళగా పేర్కొనలేదు. అంటే రాగద్వేషాలకు అతీతంగా, నీరక్షీర వివేకంతో సుంకిడ్డి ఈ పుస్తకాన్ని రాసిండనడానికి ఇంతకంటే వేరే దృష్టాంతాలు అవసరం లేదు.

శాతవాహనులు ఆంధ్ర ప్రాంతం వారు అని కొందరు చేస్తున్న ప్రచారాన్ని ఈ పుస్తకం ద్వారా తిప్పికొట్టిండు.‘నాగబు’ మొదటి తెలుగు పదంకాదు అనే విషయాన్ని ‘తెలంగా ణ చరిత్ర’ ద్వారా విస్తృత ప్రచారంలోకి తీసుకొచ్చా డు. మద్రాసు, హైదరాబాద్ ఆర్కయివ్స్‌ని విస్తృతం గా వినియోగించుకున్నప్పటికీ ఈ పుస్తకం ప్రధానంగా సెకండరీ సోర్సెస్ మీద ఆధారపడి రాసిన గ్రంథం. అయితే సుంకిడ్డి చూపించిన మార్గం లో వెళ్ళి ఒక్కొక్క చాప్టర్‌ను ఒక్కో సంచిక (గతంలో వెలువరించిన రెడ్డి, కాకతీయ, శాతవాహన సంచికల మాదిరిగా)గా వెలువరించాలి. ఇందులో ప్రస్తావనకు వచ్చిన రుద్రమదేవి, సమ్మక్క, సారమ్మ, రాణి శంకరమ్మ, సదాశివడ్డి, భాగ్యడ్డి వర్మ, షోయాబుల్లాఖాన్ తదితరుల గురిం చి ప్రత్యేక జీవిత చరివూతలు వెలువడి నట్లయితే దాంతో సమగ్ర తెలంగాణ చరిత్ర రూపుదిద్దుకుంటుంది. ఇందులో లేని దళిత హీరో జంబన్న, రూపాబాయి ఫర్దూంజీ లాంటి వారి చరివూతలు కూడా సమగ్ర చరివూతకు దోహదం చేస్తాయి.

ఇంతవరకూ ఆంధ్రవూపదేశ్‌లోని అన్ని విశ్వవిద్యాలయాలు, విద్యార్థులు తెలంగాణను ఒక అనుబంధ చాప్టర్‌గా మాత్రమే చదువుకున్నారు. ఇప్పుడందరికీ ఈ పుస్తకం పాఠ్యాంశంగా బోధించాల్సిన అవసరముంది. అంతేకాదు ఈ పుస్తకం చదివిన చరివూతాభిమానులందరికీ తన్ను తాను తెలుసుకుంటున్న తెలంగాణ గురించి కూడా అవగతమౌతుంది. తెలంగాణ వ్యతిరేకులు తమ జ్ఞానంలోని ఖాళీలను పూరించుకునేందుకు, తెలంగాణాభిమానులు తమ జ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఈ పుస్తకాన్ని చదవాలి.
-సంగిశెట్టి శ్రీనివాస్

No comments: